ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

  • June 6, 2020 / 11:03 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘మున్నా’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించిన కళ్యాణి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా రాణించింది కూడా..! మలయాళం నటి అయిన కళ్యాణి అసలు పేరు కావేరి. సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాక కళ్యాణి గా పేరు మార్చుకుంది. రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘శేషు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కళ్యాణి. ఆ తరువాత ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామర్ షో ఏమాత్రం చేసేది కాదు.. ఒకవేళ అలాంటి పాత్రలు వచ్చినా ఈమె నో చెప్పేసేదట. అయినా సరే ఈమె నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ‘కబడ్డీ కబడ్డీ’ ‘దొంగోడు’ ‘పెదబాబు’ ‘వసంతం’ ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ‘సత్యం’ సినిమా దర్శకుడు సూర్య కిరణ్ ను పెళ్ళి చేసుకుంది కళ్యాణి. ఆ తర్వాత కూడా ‘లక్ష్యం’ ‘రక్ష’ వంటి చిత్రాల్లో నటించింది.

కొన్నాళ్ళు వీరిద్దరూ బాగానే కలిసి జీవించారు. కానీ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు అని వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు ఈమె ఎటువంటి సినిమాల్లోనూ నటించలేదు. అయితే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తుంది.’లక్ష్యం’ ‘లెజెండ్’ ‘టాక్సీ వాలా’ ‘యాత్ర’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు ఓ చిత్రానికి డైరెక్షన్ కూడా చేస్తుందని టాక్ నడుస్తుంది. మరి ఆ చిత్రం ఏంటో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus