Mahesh Babu: తన 28 వ సినిమా గురించి మహేష్ ట్వీట్ వెయ్యలేదే..!

  • May 4, 2021 / 09:32 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. కేవలం తన సినిమాల గురించే కాకుండా మిగిలిన హీరోల సినిమాల గురించి కూడా స్పందిస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బాగుందని ఓ రేంజ్లో పొగిడేసాడు. అటు తరువాత పవన్ కరోనా భారిన పడితే.. ‘త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నట్టు’ కూడా ఓ ట్వీట్ వేసాడు.ఇక మొన్నటికి మొన్న దర్శకుడు కె.వి.ఆనంద్ మరణిస్తే ఆ విషయం పై కూడా స్పందించాడు.

కానీ తన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పోకిరి’ గురించి ఎటువంటి ట్వీట్ వెయ్యలేదు. అది పక్కన పెట్టేసినా..త్రివిక్రమ్ డైరెక్షన్లో తాను చెయ్యబోతున్న 28వ చిత్రం గురించి కూడా ట్వీట్ వెయ్యలేదు మహేష్. ఆ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ ఇచ్చి నాలుగు రోజులు కావస్తున్నా మహేష్.. ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. అలాగే రీ ట్వీట్ వంటివి కూడా చెయ్యలేదు. దాంతో ఈ ప్రాజెక్టు కూడా డౌటేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ ట్వీట్ వెయ్యకపోవడానికి కారణాలు ఏంటి? అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. కానీ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయిన ‘జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్’ ఖాతా నుండీ మాత్రం ట్వీట్ పడింది. సెంటిమెంట్ ప్రకారం.. తన తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసి ఈ ప్రాజెక్టు గురించి మహేష్ స్పందించే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus