కంగనాని కలిసి సారీ చెబుతా: ఆలియా భట్‌

  • February 8, 2019 / 10:56 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల ‘మణికర్ణిక’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయిందనే చెప్పాలి. అయితే కంగనా నటనని, ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ కొందరు సెలెబ్రిటీలు.. కంగానని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఆలియా భట్, ఆమీర్ ఖాన్ వంటి వారు ‘మణికర్ణిక’ చిత్రం పై స్పందించలేదు. ఇక ఈ విషయం పై కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, ఆమీర్ ఖాన్ ల పై విమర్శలు చేసింది.

దీని పై కంగనా స్పందిస్తూ… ‘బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో అలియా భట్ ని టార్గెట్ చేస్తూ.. ‘రాజీ’ సినిమా ట్రైలర్ చూసి ఆలియా, దర్శకురాలు మేఘనాలతో అరగంట సేపు పైనే మాట్లాడినట్లు కంగనా చెప్పుకొచ్చింది. బహిరంగంగా కూడా ప్రశంసించినట్లు చెప్పుకొచ్చింది. కానీ తన సినిమా ప్రీమియర్ షోకి మాత్రం ఎవరూ రాలేదని అవసరం ఉంటే బాగా మాట్లాడతారని లేదంటే పట్టించుకోరని’ వెల్లడించింది. ఈ విషయం పై ఓ మీడియా ఇటీవల అలియా భట్ ని ప్రశ్నించింది.

దీని పై ఆలియా వివరణ ఇస్తూ .. ”కంగనా నాకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒక వ్యక్తిగా నటిగా ఆమె అంటే.. నాకు ఎప్పుడూ ఇష్టం. మనసులో ఉన్న విషయాన్ని ఆమె ధైర్యంగా వెల్లడించగలదు. నా విషయంలో ఆమెకి తలెత్తిన ఇబ్బంది ఏమిటో అడిగి తెలుసుకుంటా.. ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉన్నా.. కంగనాను వ్యక్తిగతంగా కలిసి సారీ చెబుతా” అంటూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus