చిరంజీవి సినిమాకు ఆమెను తీసుకుంటున్నారట!

  • May 10, 2021 / 02:29 PM IST

అందం, అందమైన గొంతు రెండూ కలిసి ఉండటం చాలా కష్టం. ఎక్కడో హాలీవుడ్‌లో ఇలాంటి భామలు కనిపిస్తుంటారు. పాటతో మెప్పిస్తూ, అందంతో మురిపిస్తూ ఉంటారు. మన దగ్గర కూడా అలాంటి నాయికలు కొంతమందే ఉన్నారు. అందులో మమతా మోహన్‌దాస్‌ ఒకరు. ‘రాఖీ రాఖీ..’, ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ లాంటి పాటల్ని పాడిన ఈ అందం… నటనతోనూ మెప్పించింది కూడా. అయితే అనారోగ్య కారణాల వల్ల పరిశ్రమకు చాలా రోజులు దూరమైంది. ఇప్పుడు మళ్లీ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్‌ నుండి పిలుపు అందుకుందట.

చిరంజీవి కాంపౌండ్‌ నుండి మమతా మోహన్‌దాస్‌కు ఫోన్‌ వెళ్లిందంనేది తాజా కబురు. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాల ప్రయాణం చేస్తున్నాడు. ఒకటి ‘ఆచార్య’ అయితే, మరొకటి ‘లూసిఫర్‌’ రీమేక్‌. మొదటి సినిమాకు సంబంధించి పనులు చివరిదశకొచ్చాయి. కాబట్టి ఈ సినిమా కాస్టింగ్‌ గురించి ఆలోచించక్కర్లేదు. మిగిలింది ‘లూసిఫర్‌’. ఇందులో హీరోయిన్‌ పాత్ర ఉంటుందని కొన్ని రోజులు, ఉండదని కొన్ని రోజులు పుకార్లు షికారు చేశాయి. మరోవైపు చెల్లెలి పాత్ర కూడా ఉంది.

మరి మమతా మోహన్‌దాస్‌ను ఏ పాత్ర కోసం పిలుపు చేశారో తెలియడం లేదు. అయితే మమత ఈ డీల్‌ని ఓకే చేస్తుందా? ప్రయోగాలు చేయడంలో మమత ఎప్పుడూ ముందుంటుంది. మరి చిరంజీవి కోసం ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో పాడిన మమత… ఇప్పుడు కలసి ఆడుతుందా అనేది చూడాలి. అయితే చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌తోపాటు ‘వేదాళం’ రీమేక్‌ పనులు కూడా మొదలుపెట్టాడని టాక్‌. మరి ఆ సినిమా కోసం ఏమన్నా మెహర్‌ రమేశ్‌ పిలుపు చేశాడా?

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus