లాభాలు బాట పట్టిన ‘ఏడు చేపల’ బయ్యర్స్ ..!

  • November 13, 2019 / 07:14 PM IST

‘చరిత సినిమా ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.ఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘ఏడు చేపల కథ’. ఎస్.జె.చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అభిషేక్, భాను శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ లు చూసి ఓ రేంజ్లో టెంప్ట్ అయిన ప్రేక్షకులు ఈ సినిమాకి ఎగబడి వెళ్ళారు. అయితే టెంప్ట్ అయ్యి వెళ్ళినంతగా సినిమాలో ఏమీ లేదంటూ మళ్ళీ వాళ్ళే పబ్లిక్ టాక్ లో తిట్టిపోశారు. క్లాస్ సెంటర్స్ జనాలు ఈ చిత్రానికి పెద్దగా టెంప్ట్ అవ్వలేదుగాని మాస్ సెంటర్స్ లో మాత్రం ఎగబడి చూసారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి 1.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 6 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 2.33 కోట్ల షేర్ ను రాబట్టింది. చిత్రం కొన్న బయ్యర్స్ అంతా లాభాల బాట పట్టారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ చిత్ర్రాన్ని తిట్టి పోశారు. ఇలాంటి బూతు కంటెంట్ తో వచ్చే ట్రైలర్లు, పోస్టర్లు చూసి సినిమాకి వెళ్ళకూడదనే గుణపాఠాన్ని మాత్రం బలంగా నేర్పిందట. సో ఇప్పటికైనా బూతు చిత్రాలకి స్వస్తి పలుకుతారేమో చూడాలి.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus