ఉరేసుకొని చనిపోయిన నటి.. కారణమేంటంటే..?

  • March 5, 2020 / 10:30 AM IST

చెన్నైకి చెందిన నటి పద్మ (23) ఆదివారం నాడు తిరువొట్టియుర్ లోని తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. రెండు నెలల క్రితం తన భర్త పవన్ (25)తో కలిసి ఇంటిని అద్దెకి తీసుకుంది పద్మ. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ కొడుకుని బంధువుల ఇంట్లో ఉంచి పెంచుతున్నారు. ప్రతి వారం బిడ్డను చూసుకోవడానికి వెళ్తుంటారు.

అయితే నెల రోజులుగా పద్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. నెల రోజుల క్రితం పద్మ భర్త ఆమెతో గొడవ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కి వెళ్లిపోయాడు. అప్పుల బాధల్లో కూరుకుపోయిన పద్మ ఆదివారం నాడు తన సోదరికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయని, సరైన పాత్రలు కూడా రావడం లేదని చెప్పుకొని వాపోయింది. ఆ తరువాత ఉరేసుకొని చనిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పద్మ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆమె అప్పటికే చనిపోయి ఉంది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus