Ys Jagan,Bharathi: సర్కారు వారి పాట చిత్రాన్ని చూసిన ఏపీ సీఎం దంపతులు.. ఏమన్నారంటే?

  • May 18, 2022 / 04:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను సంపాదించింది. సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమాని చూసి ఈ సినిమాపై వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కర్నూలులో ఈ సినిమా సక్సెస్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇలా ఇప్పటికే ఈ సినిమా పై పలువురు స్టార్స్ స్పందిస్తూ సినిమా గురించి మహేష్ బాబు నటన గురించి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి ఈ సినిమాని వీక్షించారు.ఈ క్రమంలోనే సినిమా చూసిన అనంతరం భారతి ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా భారతి మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు.

భారతి మీడియాతో మాట్లాడుతూ తనకు మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమని, తప్పకుండా అతని సినిమాలు చూస్తానని ఈమె తెలియజేశారు.తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా చూశానని ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ఈమె వెల్లడించారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు యాక్షన్ అద్భుతంగా ఉంది అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఈ సినిమాలో తనకు ఇష్టమైన డైలాగ్ గురించి భారతి మాట్లాడారు.

ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన నేను విన్నాను నేను ఉన్నాను అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ డైలాగ్ మహేష్ బాబు సినిమాలో పెట్టడం వల్ల సినిమాకు మరింత హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో భాగంగా ఈ డైలాగ్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా చూసిన సీఎం సతీమణి తనకి ఈ సినిమాలో ఈ డైలాగ్ చాలా బాగా నచ్చిందని తెలిపారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus