తన డాన్సులతో రచ్చ చేసిన కియారా అద్వానీ..!

  • March 20, 2019 / 05:15 PM IST

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది కియారా అద్వానీ. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. దాంతో రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇద్దరు స్టార్ హీరోల చిత్రంలో నటించడంతో కియారా కి మంచి ఐడెంటిటీ దక్కింది. ఇప్పటి హీరోయిన్లలో కియారా కి ఉన్న క్రేజే వేరు. ఓవైపు బాలీవుడ్,టాలీవుడ్ లలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే మరోవైపు ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో నిరంతరం హాట్ టాపిక్ గా నిలుస్తుంది కియారా.

ప్రస్తుతం ముంబైలో ఏ ర్యాంప్ షో జరుగుతున్నా సరే అక్కడ వాలిపోతోంది కియారా. పార్టీలైనా, పబ్బులైనా, క్లబ్బులైనా ఎక్కడ చూసినా కియారా నే ర్యాంప్ షో లు కనువిందు చేస్తూనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాలలో ఇంతలా పాపులరైన హీరోయిన్ కియారా మాత్రమే. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. కొన్ని మ్యాగజైన్స్ కు హాట్.. హాట్ ఫోటో షూట్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు ప్రఖ్యాత ‘జీ సినీ అవార్డ్స్’ 2019 ఈవెంట్లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో కియరా షేర్ చేయగా లక్షల లైకులు రావడం విశేషం. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి బద్లాపూర్ నుండీ ‘జీనా జీనా’ పాటకు అలాగే ‘ఏబీసీడీ 2’ నుండీ ‘సన్ సాథియా’ పాటకు కియారా స్టెప్పులు చూస్తే కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే.

CLICK HERE TO WATCH VIDEO 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus