ప్ర‌శాంత్ వ‌ర్మ, తేజ స‌జ్జా కాంబినేష‌న్ ఫిల్మ్‌ ‘జాంబీ రెడ్డి’ షూటింగ్ పూర్తి.. డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభం

  • November 18, 2020 / 03:56 PM IST

ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ షూటింగ్ పూర్త‌యింది. బాల‌న‌టునిగా ప్రేక్ష‌కుల విశేష ఆద‌రాభిమానాలు పొంది, ‘ఓ బేబీ’ చిత్రంలో చేసిన కీల‌క పాత్ర‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆనంది, ద‌క్ష హీరోయిన్లు. బుధ‌వారం ఈ చిత్రానికి సంబంధించి డ‌బ్బింగ్ వ‌ర్క్ మొద‌లైంది. మొద‌ట‌గా హీరో తేజ స‌జ్జా త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కూ, మోష‌న్ పోస్ట‌ర్‌కూ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

త్వ‌ర‌లో టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌న ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, లాక్‌డౌన్ స‌డ‌లించాక ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు టాలీవుడ్‌లో షూటింగ్ పున‌రుద్ధ‌రించి, పూర్తి చేసిన తొలి చిత్రం ఇదే. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అంద‌రి స‌హ‌కారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీక‌ర‌ణ పూర్తి చేశామ‌నీ, ఇందుకు వారికి థాంక్స్ చెప్పుకుంటున్నామ‌నీ ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus