Vaishnavi Chaitanya: ఫ్లోలో ‘లవ్ మీ’ కథ మొత్తం చెప్పేసిన ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి.. దిల్ రాజు రియాక్షన్ ఇది!
May 16, 2024 / 09:54 PM IST
|Follow Us
దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) హీరోగా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) తర్వాత రూపొందిన చిత్రం ‘లవ్ మీ’ (Love Me). ‘బలగం’ తర్వాత ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రూపొందిన సినిమా ఇది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy) , నాగ మల్లిడి నిర్మాతలు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ ఇది. పైగా ‘ఆర్య’ కథ విన్నప్పుడు ఎలాంటి వైబ్స్ వచ్చాయో ‘లవ్ మీ’ కథని దర్శకుడు అరుణ్ భీమవరపు చెబుతున్నప్పుడు కూడా అదే వైబ్స్ వచ్చాయి అంటూ దిల్ రాజు చెప్పడంతో ‘లవ్ మీ’ పై మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.
తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది కూడా అందరినీ ఆకట్టుకుంది. కచ్చితంగా ఆశిష్ కి మంచి సక్సెస్ అందిస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ‘లవ్ మీ’ ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. ” ‘లవ్ మీ’ కథ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ అని చెప్పాలి. ఇందులో షాకింగ్ , థ్రిల్స్, హర్రర్.. ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో నాది చాలా టఫ్ క్యారెక్టర్.
ఎవరితోనూ కలవకుండా ఉండే క్యారెక్టర్ అది. హీరో క్యారెక్టర్ ఇంకా టఫ్.ఏది వద్దు అంటే అది చేసే క్యారెక్టర్ అతనిది. దెయ్యం జోలికి పోవద్దు అంటే.. దాని జోలికి వెళ్తాడు. దాన్ని ప్రేమించి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి.. దాని ప్రాబ్లమ్ తీరుస్తాడు” అంటూ కథ మొత్తం చెప్పేసింది. ఆ టైంలో దిల్ రాజు చూసి ‘ఇంకెందుకు క్లైమాక్స్ కూడా చెప్పేయ్’ అంటూ కౌంటర్ వేశారు. దీంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది.